జలాశయాలు, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి పాయకరావుపేట in Visakhapatnam,Vizagvision విశాఖ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి.పాయకరావుపేట నియోజకవర్గంలో శనివారం రాత్రి నుంచి 38.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. పాయకరావుపేట మండలం గుండా ప్రవహిస్తున్న తాండవ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాయకరావుపేట తాండవ నదీ పరివాహక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇల్లు నీట మునిగాయి.తాండవ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.ప్రజలను సురక్షిత స్థావరాలకు తరలించారు.తాండవ నది ప్రవాహిక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పాయకరావుపేట వైసీపీ టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయి.పాయకరావుపేట గ్రామంలో చాకలి పేట 9వ వార్డు మొత్తము నీట మునగడం తో పాయకరావుపేట ఎమ్.ఆర్.ఓ అంబెడ్కర్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.నదీ ప్రవాహం తగ్గేవరకు సురక్షిత భవనాల్లో స్థావరాలు , భోజన వసతులు క్షల్పిస్తామని అన్నారు.