ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు Vizagvision ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా మావోయిస్టులు కోసం ఒడిశాకు చెందిన ఎస్వోజీ.బీఎస్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కటాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలోని ముకిడిపల్లి, గురుసేతు, బెజ్జింగి, జంపలూరు, పర్లుబంద గ్రామాల్లో సంయుక్త గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా, మావోయిస్టులు దాచి ఉంచిన డంప్ను కనుక్కొన్నారు. ఇందులో ఒక దేశీయతుపాకీ, క్లైమెర్మెన్,వైర్, మూడు రంగుల్లో ఉన్న పేలుడు సామాగ్రీ, ఎనిమిది ఎలక్ర్టిక్ డిటోనేటర్లు , ఆక్సిజన్ సిలిండర్, కెమెరాఫ్లాష్, ఇనుపపైపులు, వైరు, మావోయిస్టు విప్లవసాహిత్యంను స్వాధీనం చేసుకున్నట్లు ఒడిశా పోలీసులు తెలిపారు.