800 Years old Darga Undertake Renovation of Hz ISHAQ MADANI aulia OLD Town visakhapatnam Vizagvision

800 years old Darga Undertake Renovation of Hz ISHAQ MADANI aulia Darga OLD Town visakhapatnam Vizagvisionవిశాఖపట్నం పాత నగరంలోని హజ్రత్ సయ్యద్ అలీ ఇసాక్ మదానీ ఔలియా దర్గా ఆధునీకరణకు జీవిఎంసి 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారు. వక్ఫ్ బోర్డు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యుపి కి చెందిన ముస్లిం మత గురువు హజ్రత్ మౌలానా బర్కత్ అహ్మద్ ముజాదిద్ది సజ్జదా, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, ఖాదర్ భాషా, వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఐ హెచ్ ఫరూఖి, జీవీఎంసీ 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు.

Read more

Saptha Shakti Sangam Matru Moorthula Sammelan at Sri Krishna Vidya Mandir Visakhapatnam Vizagvision

Saptha Shakti Sangam Matru Moorthula Sammelan at Sri Krishna Vidya Mandir Visakhapatnam Vizagvision. స్థానిక ద్వారకా నగర్లో గల శ్రీ టి. వి.స్. శ్రీకృష్ణ విద్యా మందిర్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేడుక సందర్భంగా “సప్త శక్తి సంగం” పేరున మాతృమూర్తుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి అధ్యకులుగా పాలక మండలి సభ్యులు శ్రీమతి అంజలీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలనంతో, పాఠశాల వందనంతో సభ ప్రారంభమైనది. ప్రధాన వక్తలుగా డా. సాయిబాల గారు, గాయత్రి విద్యా పరిషత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి యు. శేషులత గారు పాల్గొన్నారు. మహిళాశక్తి గూర్చి, కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర మరియు పర్యావరణ పరిరక్షణ గురుంచి ప్రసంగించారు. మాతృమూర్తుల వలన మాత్రమే సమాజాభ్యుదయం సాధ్యమవుతుందని వక్తలు తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో భాగంగా విశాఖపట్నం 43వ వార్డు కార్పొరేటర్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారి శ్రీమతి పెద్దిసెట్టి ఉష శ్రీ గారిని సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వి. నర్మద గారి ఆధ్వర్యంలో మాతృ మూర్తుల సమ్మేళన కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.

Read more

Saptha Shakti Sangam Matru Sammelana Sri T.V.S Rao Sri Krishna Vidya Mandir in Visakhapatnam

Saptha Shakti Sangam Matru Sammelana
Sri T.V.S Rao Sri Krishna Vidya Mandir in Visakhapatnam Vizagvisionస్థానిక ద్వారకా నగర్ లో గల శ్రీ టీవీఎస్ రావు శ్రీకృష్ణ విద్యా మందిర్ పాఠశాలలో సప్తశక్తి సంఘంలో భాగంగా మాతృమూర్తుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి అధ్యక్షులుగా డాక్టర్ బి ధరణి ప్రియ గారు విచ్చేశారు ముఖ్య అతిథులుగా డాక్టర్ పీకే జయలక్ష్మి గారు శ్రీమతి లింగము ఉజ్వలగారు శ్రీమతి అంజలి ప్రసాద్ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతివి నర్మద గారు పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వల నతోకార్యక్రమం ప్రారంభమైంది. పాఠశాల వందనంతో సభ మొదలుపెట్టారు సప్తశక్తి సంఘం లో మహిళా ప్రబోధన గురించి వక్తలు ఉపన్యాసించారు జయలక్ష్మి గారు కుటుంబ ప్రబోధం గురించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ గురించి కుటుం బ అభివృద్ధిలో స్త్రీ యొక్క పాత్ర గురించి ప్రసంగించారు శ్రీమతి ఉజ్వల గారు భారతదేశ ఉన్నతిలో మహిళల పాత్ర గురించి ప్రసంగించారు చివరిగా డాక్టర్ ధరణి ప్రియ గారు అధ్యక్ష భాషణలో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరా లు పూర్తయిన సందర్భంగా మహిళల గొప్పతనం గురించి వారి సామర్థ్యాన్ని గురించి ప్రసంగించారు సభలో పలువురు మాతృమూర్తులను సన్మానించారు ఈ సప్తశక్తి సంఘం సభ స్త్రీమూర్తులతో కలకలలాడింది చక్కని ఉపన్యాసాలతో అలరించారు స్త్రీమూర్తుల కరతాలధ్వనులతో సభ దిగ్విజయంగా ముగిసింది

Read more