Home Newsకామాఖ్య దేవి ఆలయ రహస్యం Kamakhya Devi Temple Secret in Assam Vizag Vision

కామాఖ్య దేవి ఆలయ రహస్యం Kamakhya Devi Temple Secret in Assam Vizag Vision

by kishore226226@gmail.com

#Vizagvision
కామాఖ్య దేవి ఆలయ రహస్యం Kamakhya Devi Temple Secret in Assam Vizag Vision కామాఖ్య దేవాలయం కామాఖ్యాదేవి కొలువైన ఆలయం ఇది 51 శక్తి పీఠాలలో ప్రాచీనమైంది ఇది భారతదేశంలోని అస్సాం లోని గౌహతి నగర పశ్చిమభాగంలోని నీలాచల్ కొండల యందు గల ఒక శక్తి ఆలయం. ఇది అనేక ప్రత్యేక దేవాలయాలు కలిగిన ప్రధాన ఆలయం. ఈ ఆలయంలో ఉన్న పది దేవాలయాలు పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి; కాళీ, తార, శోదషి, భువనేశ్వరి, బైరవి, చిన్నమస్తా, ధుమవతి, బగలముఖి, మాతంగి, కమల వీటిలో త్రిపుర సుందరి, మాతంగి, కమల దేవాలయాలు ప్రక్కప్రక్కన ప్రధాన దేవాలయంలో ఉన్నాయి. మిగిలిన ఏడు దేవాలయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. సాధారణ హిందువులకు, తాంత్రిక భక్తులకు ఇది ఒక ముఖ్యమైన యాత్రాస్థలము.2015 జూలైలో భారత సుప్రీం కోర్టు ఈ దేవస్థాన యజమాన్యాన్ని కామాఖ్య దేబుట్టెర్ బోర్డు నుండి బోర్దేవ్రి సమాజ్ కు బదిలీ చేసింది.ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్మాణం 8 నుండి 17 వ శతాబ్దం మధ్యకాలంలో అనేక సార్లు నిర్మించుట, ఆధునీకరించుట జరిగింది. ఈ దేవాలయ నిర్మాణ శైలిని సాధారణంగా నీలాచల్ రకం అని పిలుస్తారు. ఈ నిర్మాణంలో ఒక శిలువ ఆకార ఆధారంపై అర్థ గోళాకార గోపురం ఉంటుంది ఈ దేవాలయంలో నాలుగు గదులు ఉంటాయి. అవి గర్భగృహం, మూడు మండపాలు. ఈ మండపాలను స్థానికంగా తూర్పు నుండి పశ్చిమానికి వరుసగా కలంట, పంచరత్న, నతమందిర అని పిలుస్తారు.ప్రస్తుత దేవాలయ రూపం 1565లో కోచ్ రాజవంశానికి చెందిన చిలరాయ్ చే మధ్యయుగ దేవాలయాల తరహాలో నిర్మించబడింది.అంతకుముందు గల నిర్మాణము కాలా పహార్ అనే అజ్ఞాత వ్యక్తిచే నాశనము చేయబడింది. ప్రస్తుత నిర్మాణము తేనెపట్టులాంటి శిఖరముతో అద్భుతమైన శిల్ప శ్రేణులు, వెలుపలివైపు వినాయకుడు, హిందూ దేవుళ్ళు, దేవతల చిత్రాలను కలిగి ఉంది.ఈ దేవాలయము మూడు పెద్ద మండపాలను కలిగి ఉంది. పశ్చిమ మండపం చాలా పెద్దది, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది, సాధారణ యాత్రికులు తమ పూజ కొరకు దీనిని ఉపయోగించరు. మధ్య మండపం చతురస్రాకారంలో ఉండి, తరువాతి కాలంలో ప్రతిష్ఠించబడిన అమ్మవారి చిన్న ప్రతిమను కలిగి ఉంది. ఈ మండప గోడలపై నరనారాయణుని చిత్రములు, దానికి సంబంధిత గాథలు, ఇతర దేవుళ్ళ చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. మధ్య మండపము గుహ రూపంలో ఉన్న దేవాలయము యొక్క పవిత్ర స్థలము నకు దారి తీస్తుంది. అక్కడ ఏవిధమైన రూపము ఉండదు. కానీ సహజంగా భూగర్భంలో ఏర్పడిన నీటి బుగ్గలోని నీరు యోని ఆకారం గల గండశిల పగులులోంచి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి వేసవిలో అంబువాసి పండుగ సందర్భంగా కామాఖ్య దేవత యొక్క రసజ్వల ఉత్సవాలు నిర్వహింపబడతాయి. ఈ సమయంలో గర్భగుడి నుండి ప్రవహించే నీరు ఎర్రగా ఐరన్ ఆక్సైడ్ వలె రుతుస్రావము వలె కనబడుతుంది. ఇది పురాతన ఖాసి బలి ఇచ్చే స్థలం వలె ఉండేది, ఇక్కడ పూజలు ఇంకా బలులను కూడా కలిగి ఉన్నాయి. ఉపాసకులు ప్రతి ఉదయము అమ్మవారికి అర్పించటానికి మేకలను వెంటపెట్టుకొని వస్తారు.ప్రాచీన సంస్కృత సాహిత్యానికి చెందిన కాళికా పురాణం కామాఖ్య దేవిని కోరికలను తీర్చే దానిగా, శివుని చిన్న భార్యగా, ముక్తిని ప్రసాదించే దానిగా వర్ణించింది. శక్తియే కామాఖ్యగా పిలవబడుతోంది.ఒక పురాణం ప్రకారం కోచ్ బీహార్ రాజ కుటుంబాన్ని దేవి తనకు తాను ఆలయంలో పూజలు చేయకుండా నిషేధించింది. ఈ శాప భయంచేత ఈ వంశస్థులు ఈ రోజుకి కూడా ఆ దారివెంట వెళుతూ ఉన్నప్పుడైనా కనీసం కామాఖ్య పర్వతాన్ని చూడడానికి కుడా ధైర్యం చేయరు.కోచ్ రాజ కుటుంబం మద్దతు లేకపోవడంతో ఆలయం చాల కష్టాలు ఎదుర్కొంది. 1658 చివరి నాటికి అహోంలు జయధ్వజ సింహ రాజు నేతృత్వంలో అస్సాం క్రింది భాగాన్ని జయించారు,, ఆలయంపై వారికి అభిరుచి పెరిగింది. దశాబ్దాల పాటు అహోం రాజులు శైవితి లేదా శాక్తల ఉపాసకులుగా ఉంటూ, ఆలయ పునర్నిర్మాణము, నూతన నిర్మాణములు చేసి ఆలయానికి మద్దతును కొనసాగించారు.రుద్ర సింహుడు (కాలము 1696 నుండి 1714) ఒక హిందూ మత ఉపాసకుడు. అతను ముసలివాడైన తరువాత ఆచారం ప్రకారం హిందూ మతాన్ని స్వీకరించి, సనాతన హిందువుగా మారి, గురువును ఆశ్రయించాడు. అతను రాజుకు మంత్రాలను నేర్పి రాజుకు ఆధ్యాత్మిక మార్గదర్శి అయ్యాడు. కానీ, తన పాలనలో ఉన్న ఒక బ్రాహ్మణుని యందు అణుకువ కలిగి ఉండటం అనే ఆలోచనను భరించలేకపోయాడు. అందుచేత అతను రాయబారులను బెంగాల్కు పంపి, నాడియా జిల్లాలోని శాంతిపూర్ దగ్గరగల మలిపోతలో నివసించుచున్న శక్త శాఖకు చెందిన ప్రముఖ మహంత్ అయిన కృష్ణారామ్ భట్టాచార్యను రమ్మని ఆజ్ఞాపించాడు. మహంత్ రావటానికి ఇష్టపడలేదు కానీ, కామాఖ్య ఆలయ రక్షక బాధ్యతలు ఇస్తామని హామీ ఇవ్వటంతో ఒప్పుకున్నాడు. రాజు తను శరణు కోరనప్పటికీ, తన కుమారులను తన సహచర వర్గంలోని బ్రాహ్మణులను అతనిని ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించమని ఆజ్ఞాపించుట ద్వారా మహంత్ ను సంతృప్తిపరచాడు.రుద్ర సింహుని మరణాంతరం అతని పెద్ద కొడుకు శిబ సింహుడు (కాలం 1714 నుండి 1744), రాజు అయిన తరువాత కామాఖ్య ఆలయ నిర్వహణను, దానికి గల ఎన్నో ఎకరాల భూమిని (దైవదత్త భూమి) మహంత్ కృష్ణారామ్ భట్టాచార్యకు అప్పగించాడు.
For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.