Vizagvision Visakhapatnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 వసంతాలు అయింది. త్యాగరాజ స్వామి భక్తుడైన సుసర్ల సూర్య భగవత్ శంకర శాస్త్రి గారు సంకల్పం విశాఖపట్నంలో ఒక సాంస్కృతిక కేంద్రం ఉండాలని అది నెరవేర్చే దిశలో శ్రీ సి.ఎస్.ఎన్. రాజుగారు, Dr. గోపాల్ శాస్త్రి గారు, శ్రీ డివి సుబ్బారావు గారు, శ్రీ వి.సీతారామయ్య గారు, శ్రీ Ch.V జోగారావు గారు ఇలాంటి పెద్దలు ట్రస్టుగా ఏర్పడి నిర్మించిన కళాక్షేత్రమే ఈ కళాభారతి. అప్పటినుంచి ఇప్పటివరకు కొన్ని వేల కచేరీలు, నృత్య కార్యక్రమాలు, నాటకాలు, సాహితీ కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు, త్యాగరాజ ఉత్సవాలు , వాగ్దేయ కార్ల ఉత్సవాలు ఈ వేదికపై నిర్వహించడం జరిగింది. భారతరత్నలు, పద్మ విభూషణలు, పద్మభూషణలు, పద్మశ్రీలు, సంగీత కళానిధులు, ఇంకా ప్రపంచవ్యాప్తి చెందిన ప్రఖ్యాత కళాకారులు ఈ వేదికపై ప్రదర్శనలు ఇచ్చి విశాఖపట్నం ని కళాభారతి ద్వారా కళలకి కేంద్రం అయింది. విశాఖ వాసులందరికీ అటువంటి కళాకారుని పరిచయం చేసే భాగ్యం కళాభారతి ట్రస్ట్ వారికి దక్కింది అని కళాభారతి అధ్యక్ష కార్యదర్శులు అన్నారు.ఈ సంవత్సరం నాలుగు దశాబ్దాలు నిండిన కళాభారతి సంగీత సేవకు అనుగుణంగా ఆరు రోజులు పాటు అత్యంత ఉన్నత స్థాయి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని దానికి ముఖ్యఅతిథిగా ఒడిస్సా గవర్నర్ గారు H.E.శ్రీ కే హరి బాబు గారు 27వ తారీఖున జరగబోయే “నాట్య విద్యా భారతి” బిరుదు సత్కార సభకి ముఖ్యఅతిథిగా వస్తున్నారు అని మంతేనా సత్యనారాయణ రాజు అధ్యక్షులు తెలియజేశారు. అలాగే 26 వ తేదీన Vice Admiral Sanjay Bhalla ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారని తెలిపారు.ముందుగా ఆరు రోజుల ఉత్సవాల ఆహ్వాన పత్రికను అధ్యక్షులు MSN రాజు , కార్యదర్శి డాక్టర్ రాంబాబు , కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్, ట్రస్టీ మల్లికా మనోజ్ గ్రంథి , ట్రస్టీ శ్రీ ఎస్ రామగోపాల్ , పంతుల నర్సింగరావు & మేనేజర్ మోహన్ దాస్ ఆవిష్కరించారు.తర్వాత ప్రధాన కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ మొదట రోజు (22/8/2026) న ప్రఖ్యాత గాత్ర విద్వాంసరాలు ఈ వారంలోనే సంగీత నాటక అకాడమీ పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని మన విశాఖకే గర్వకారణమైన కళాకారిణి డాక్టర్ పంతుల రమ గారి గాత్ర కచేరితో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు రెండవ రోజున(23/8/2026) సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారధ్యంలో విజయవాడ వారు : “జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్” చారిత్రాత్మాక నాటకాన్ని 60 మంది కళాకారులతో అత్యంత భారీ సెట్టింగ్లతో ప్రదర్శించబోతున్నారని అన్నారు. మూడో రోజున (24/8/2026) ప్రఖ్యాత హిందుస్తానీ విద్వాంసులు ,ఢిల్లీ, కాశ్మీర్, కలకత్తా నుంచి వచ్చి హిందుస్తానీ గాత్ర & సరోద్ వాయిద్య జుగల్బంది కచేరి చేయబోతున్నారని అన్నారు. నాలుగవ రోజు(25/8/2026) ప్రపంచ ఖ్యాతిగాంచిన ప్రఖ్యాత గాత్ర విద్వాంసులు త్రిచూర్ బ్రదర్స్ చెన్నై నుంచి వచ్చి అద్భుత కచేరి చేయనున్నారని అన్నారు .ఐదవ రోజున (26/8/2026) సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీ మైసూర్ మంజునాథ్, వారి కుమారుడు విద్వాన్ సుమన్ మంజునాథ్ కలిసి వైలెన్ ద్వయం కచేరి ఉంటుందని అన్నారు. ఆఖరి రోజున (27. 8 .2026) సాయంత్రం 6:30 గంటలకు విఎండిఏ ప్రతిస్టాత్మకంగా ఇచ్చే వార్షిక బిరుదు ప్రధానం “నాట్య విద్యా భారతి” బిరుదును 84 ఏళ్ల భరతనాట్య కళాకారిణి , పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం గారికి ప్రధానం చేయనున్నామని,, ముఖ్యఅతిథిగా H.E డాక్టర్ కే హరి బాబు గారు గవర్నర్ ఒడిశా వచ్చి వారి చేతుల మీదుగా ప్రధానోత్సవం జరుగుతుందని, అలాగే రెండున్నర లక్షలు విలువ చేసే వైభవ్ జ్యువెలర్స్ స్పాన్సర్ చేస్తున్న “స్వర్ణకమలం”, లక్ష రూపాయల నగదు బహుమతి ,ప్రశంసా పత్రం, నూతన వస్త్రాలు, కర్పూర మాలలతో పురస్కార గ్రహీతను ఘనంగా సత్కరించనున్నామని అన్నారు. పైన చెప్పిన ఆరు రోజుల కార్యక్రమాలు అత్యంత ఉన్నత స్థాయివని ఖర్చుక వెనకాడకుండా గొప్పవిద్వాంసులను ఆహ్వానించడం జరిగిందని సంగీత ప్రియులు, కళాకారులు , కళాభిమానులు ప్రతి ఒక్కరూ ఆరు రోజులు విచ్చేసి కార్యక్రమాలు వీక్షించి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు .ప్రతిరోజు రాత్రి భోజన రూపేనా ప్రసాదాలు ఏర్పాటు చేశామని కూడా అన్నారు .ఈ కార్యక్రమానికి బిరుదు ప్రధానోత్సవం రోజున(27/8/2026) జరిగే కార్యక్రమానికి S R K Infra Projects Pvt.Ltd chairman శ్రీ ఎం ఎస్ ఎం రాజు రెండున్నర లక్షలు స్పాన్సర్ చేస్తున్నారని , అదే రోజున మరొక రెండు లక్షల విలువ చేసే స్వర్ణకమలం వైభవ్ జ్యువెలర్స్ స్పాన్సర్ చేస్తున్నారని , నూతన వస్త్రాలు కంకటాల సిల్క్ వారు స్పాన్సర్ చేస్తున్నారని , ఈ కార్యక్రమాలు విజయానికి , శ్రీ సి ఎస్ ఎన్ రాజుగారు, శ్రీ డి ఎస్ ఎన్ రాజు ట్రస్ట్, MRC ప్రాజెక్ట్స్ మరియు కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ కే. రాంబాబు గారు అలాగే తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ కంపెనీవారు, పైడా కృష్ణ ప్రసాద్ గారు అన్నం రాజు సత్యనారాయణమూర్తి గారు ప్రాయోజకులుగా సహకారం అందిస్తున్నారని అన్నారు ఈ ఆరు రోజుల గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేరని మరొకసారి ఉద్ఘాటించారు.ప్రతిరోజు సాయంత్రం 6:30 కి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు.పత్రిక విలేకరుల అందర్నీ వారు చేస్తున్న కృషికి ప్రశంసిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని రామప్రసాదంగా అయోధ్య నుంచి వచ్చిన స్కార్ఫ్తో సన్మానించారు అధ్యక్ష కార్యదర్శులు మిగతా సభ్యులుశ్రీరామదాస డాక్టర్ రాంబాబు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ

Vizag Vision:

INTER DEPARTMENTAL SPORTS MELA–2026: ENGINEERING DEPARTMENT EMERGES OVERALL CHAMPION The Inter Departmental Sports Mela–2026, organized by East Coast Railway Sports Association (ECoRSA), Waltair Division, concluded with great enthusiasm and competitive…

Read more

Vizag Vision:

DRDO & Indian Navy successfully conduct maiden salvo launch of Naval Anti-ship Missile-Short RangeDefence Research & Development Organisation (DRDO) and Indian Navy have successfully conducted the maiden salvo launch of…

Read more

Vizag Vision Visakhapatnam :

విశాఖపట్నం ఏరా ఆరంగేట్రం – నగరానికి గేర్‌తో కూడిన ఎలక్ట్రిక్ మొబిలిటీ, తొలి ఎక్స్‌పీరియన్స్ హబ్ ప్రారంభం భారతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ మాటర్ మోటార్, విశాఖపట్నంలో భారతదేశపు తొలి గేర్ కలిగిన ఎలక్ట్రిక్ మోటర్‌బైక్‌ ‘మాటర్ ఏరా 5000+’ ను…

Read more

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే గూగుల్ ఏపీని ఎంచుకుంది సీఎం చంద్రబాబు #vizagvision #ytshots

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే గూగుల్ ఏపీని ఎంచుకుంది సీఎం చంద్రబాబు #vizagvision #ytshots

Read more

నాడు హైటెక్ సిటీ నేడు గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏపీ టెక్నాలజీకే కాదు..సీఎం చంద్రబాబు #vizagvision

నాడు హైటెక్ సిటీ నేడు గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏపీ టెక్నాలజీకే కాదు..సీఎం చంద్రబాబు #vizagvision

Read more