Saptha Shakti Sangam Matru Moorthula Sammelan at Sri Krishna Vidya Mandir Visakhapatnam Vizagvision

Saptha Shakti Sangam Matru Moorthula Sammelan at Sri Krishna Vidya Mandir Visakhapatnam Vizagvision. స్థానిక ద్వారకా నగర్లో గల శ్రీ టి. వి.స్. శ్రీకృష్ణ విద్యా మందిర్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేడుక సందర్భంగా “సప్త శక్తి సంగం” పేరున మాతృమూర్తుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి అధ్యకులుగా పాలక మండలి సభ్యులు శ్రీమతి అంజలీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలనంతో, పాఠశాల వందనంతో సభ ప్రారంభమైనది. ప్రధాన వక్తలుగా డా. సాయిబాల గారు, గాయత్రి విద్యా పరిషత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి యు. శేషులత గారు పాల్గొన్నారు. మహిళాశక్తి గూర్చి, కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర మరియు పర్యావరణ పరిరక్షణ గురుంచి ప్రసంగించారు. మాతృమూర్తుల వలన మాత్రమే సమాజాభ్యుదయం సాధ్యమవుతుందని వక్తలు తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో భాగంగా విశాఖపట్నం 43వ వార్డు కార్పొరేటర్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారి శ్రీమతి పెద్దిసెట్టి ఉష శ్రీ గారిని సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వి. నర్మద గారి ఆధ్వర్యంలో మాతృ మూర్తుల సమ్మేళన కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.

Related posts

World’s Longest and most Powerful Hydrogen Train between Jind and Sonipat #vizagvision #ytshots

Jagannath Ratha Yatra by Iskon #vizag vision #ytshorts

Sri Jagannath Ratha Yatra by Hare Krishna Movement #vizag vision #ytshorts