Vizagvision :

దేశ ప్రగతి ఎంత ముఖ్యమో… ప్రజల ఆరోగ్యం అంతే ముఖ్యం

• పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే
• గ్రీన్ బెల్ట్ నిర్వహణ, శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి
• కాలుష్యాన్ని నియంత్రించి గోస్తని నదిని కాపాడుదాం
• కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లో బాధితులను భాగస్వామ్యం చేయాలి
• కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో… ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్ర్త సాంకేతికల శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలను పక్కనబెట్టి జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లడం సరికాదన్నారు. పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని, శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు కచ్చితంగా పాటించాలని అన్నారు. మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కేవలం నివేదికలకే పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “కొన్ని ప్రాంతాల్లో జనావాసాలకు అత్యంత సమీపంలో మైనింగ్ కోసం పేలుళ్లు చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని, పేలుళ్లు దాటికి ఇళ్లకు బీటలు వారి ఆర్థికంగా నష్టపోతున్నామని బాధితుల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన పర్యావరణ ప్రమాణాలను అన్ని మైనింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
• బాధితుల భాగస్వామ్యంతో పరిష్కార మార్గాలు
కాలుష్క నియంత్రణ మండలి తనిఖీ ప్రక్రియ ప్రజలకు అర్థం కాకుండా ఒక బ్రహ్మ పదార్థంలాగా మారిపోయింది. దీంతో క్షేత్ర స్థాయిలో కాలుష్య సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు బాధితులను కూడా తనిఖీ కమిటీలో భాగస్వామ్యం చేస్తే… తనిఖీలు పారదర్శకంగా జరగడంతోపాటు బాధితులకు న్యాయం జరుగుతుంది.
• ఎవరికీ మినహాయింపులు లేవు
శబ్ద కాలుష్యం నియంత్రణలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు, కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనలు పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలు కచ్చితంగా పాటించాలి. ఇండస్ర్టియల్, కమర్షియల్, రెసిడెన్సియల్, సెన్సిటివ్ జోన్లలో నిర్దేశిత డెసిబెల్ పరిమితులను కచ్చితంగా పాటించాలి. ప్రార్థనా మందిరాలైనా జోన్ల వారీగా నిర్దేశించిన శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సిందే… ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు.
• వైట్ కేటగిరి పరిశ్రమలు కూడా కాలుష్యం వెదజల్లుతున్నాయి
నెల్లూరు జిల్లాలో కొన్ని పరిశ్రమలు వైట్ కేటగిరి కింద రిజిస్టర్ అయి, నిబంధనలకు విరుద్ధంగా దుర్వాసన, కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. బయటకు అస్సలు కాలుష్యం కలిగించని పరిశ్రమలు అని చెప్పుకుంటూ ఆర్గానిక్ వేస్ట్, రసాయన వ్యర్ధాలను బయటకు వదులుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపి పరిశ్రమల నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే సాంకేతికతను వాడి దుర్వాసన తగ్గించే పద్ధతులను పాటించేలా చేయాలి.
• కాలుష్య కోరల్లో గోస్తనీ నది
గోస్తనీ నది తీవ్రమైన కాలుష్యం బారిన పడింది. పాలకోడేరు మండలం వేండ్ర గ్రామ పరిధిలో సేకరించిన నీటి నమూనాలలో బయోలాజికల్ ఆక్సిజెన్ డిమాండ్ 15 mg/l చేరడం అనేది పర్యావరణ అత్యవసర పరిస్థితిని సూచిస్తోంది. ఈ నమూనాల ప్రకారం కాలుష్యం అనుమతించదగిన స్థాయి కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. పరిశ్రమల నుంచి నేరుగా నదిలోకి వచ్చే మురుగు, రసాయన వ్యర్ధాలను డ్రోన్, వీడియో కెమెరాల ద్వారా రికార్డ్ చేసి సంబంధిత పరిశ్రమలను బాధ్యులను చేయాలి.
• నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం విజయవంతం చేద్దాం
గాలి నాణ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం. దేశంలో అత్యంత కాలుష్యపూరిత నగరాలలో ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాల స్థాయిలను 40 శాతం వరకు తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 13 నగరాలు ఎంపిక చేసి దాదాపు రూ. 400 కోట్ల నిధులను కేటాయించారు. వాటిని జాగ్రత్తగా వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల”ని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరతపై అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకురాగా.. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే సంబంధిత ఫైలును ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.

Related posts

Vizag Vision Visakhahapatnam: మణిహారం.. భోగాపురం విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభోత్సవ వేడుకలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి*విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మిత‌మైన‌ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనుందని, ఆగస్టు 1న జరగనున్న ప్రారంభోత్సవ వేడుకను చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆధ్వ‌ర్యంలో శ‌నివారం జ‌రిగిన‌ స‌మీక్ష‌లో స్థానిక ఎమ్మెల్యేల‌తో క‌లిసి పాల్గొన్న ఆయ‌న‌ అనంత‌రం క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో భోగాపురం ఎయిర్ పోర్టు కు సంబంధించిన వివ‌రాల‌ను హోం మంత్రి అనిత‌తో క‌లిసి వెల్ల‌డించారు.*ఉత్తరాంధ్ర నుంచి భారీగా ప్రజల భాగస్వామ్యం*భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి సుమారు లక్ష మంది, ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు మూడు లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రజల భద్రత, సౌకర్యం, రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. విశాఖపట్నం నగరానికి దూరంగా విమానాశ్రయం నిర్మించారనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నప్పటికీ, భవిష్యత్‌ జనాభా పెరుగుదల, ప్రాంతీయ విస్తరణ, అంతర్జాతీయ విమానయాన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక దృష్టితో ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు స్ప‌ష్టం చేశారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భోగాపురం విమానాశ్రయం నిర్మితమైందని పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్‌ తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారని, సందర్శించే ప్రతి ఒక్కరికీ దాని విస్తృతి, నాణ్యత, భవిష్యత్‌ దృష్టి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఉత్తరాంధ్రను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లే కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా ఈ విమానాశ్రయం నిలుస్తుందని అన్నారు.*ఉత్తరాంధ్ర సంస్కృతికి అద్దం పట్టే సాంస్కృతిక కార్యక్రమాలు*ప్రారంభోత్సవ వేడుకల్లో ఉత్తరాంధ్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయ‌న తెలిపారు. ప్రసిద్ధ థింసా నృత్యంతో పాటు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కేవలం ఒక మౌలిక వసతుల ప్రాజెక్టు ప్రారంభం మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో కొత్త అధ్యాయానికి నాంది అని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.*అసిప్ సెమీ కండెక్ట‌ర్ టెక్నాల‌జీ సంస్థ‌కు శంకుస్థాప‌న‌*విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా ఏర్పాటు కానున్న ప్ర‌పంచ స్థాయి గుర్తింపు పొందిన అసిప్(ASIP) టెక్నాల‌జీస్ సెమీ కండ‌క్ట‌ర్ సంస్థ‌కు ఆగ‌స్టు 01న ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంద‌ని ప‌ల్లా శ్రీనివాస‌రావు వివరించారు. ఆ రోజు ఎయిర్ పోర్టుతో పాటు, ఏవియేషన్ హ‌బ్ – యూనివ‌ర్శిటీ, ఎడ్యుసిటీలు, జీఎంఆర్ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ కూడా ప్రారంభ‌మ‌వుతాయ‌ని, వాటితో పాటు అసిప్ టెక్నాల‌జీ సంస్థకు శంకుస్థాపం కూడా జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీపీ శంఖ‌బ్ర‌త బాగ్చీ, జీవీఎంసీ క‌మిష‌న‌ర్ కేత‌న్ గార్గ్ విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్నారు……

VizagVision Visakhapatnam:సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్ ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా రంగంలో PM e- Bus Sewa తో నూతన శకం మొదలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు. రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్‌ను ప్రారంభించి, డిపోలో ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలి ఏకాదశి రోజున రాష్ట్రం లో మొదటి E – బస్ పవర్ రూమ్ ప్రారంభం నూతన శకానికి నాంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేపట్టడంపట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు. PM e-Bus Sewa పథకం కింద రాష్ట్రానికి తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు రానుండగా, అందులో విశాఖపట్నానికి 100 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు నగరాల్లో దశలవారీగా ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం సంస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం మంత్రిగారిని డిపో కమిటీలు, కార్మికుల సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు, ఇంజినీర్లు, డిపో మేనేజర్లు, ఉద్యోగులు, వివిధ ఆర్టీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Vizagvision Visakhapatnam: