Vizagvision :

దేశ ప్రగతి ఎంత ముఖ్యమో… ప్రజల ఆరోగ్యం అంతే ముఖ్యం

• పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే
• గ్రీన్ బెల్ట్ నిర్వహణ, శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి
• కాలుష్యాన్ని నియంత్రించి గోస్తని నదిని కాపాడుదాం
• కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లో బాధితులను భాగస్వామ్యం చేయాలి
• కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో… ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్ర్త సాంకేతికల శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలను పక్కనబెట్టి జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లడం సరికాదన్నారు. పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని, శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు కచ్చితంగా పాటించాలని అన్నారు. మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కేవలం నివేదికలకే పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “కొన్ని ప్రాంతాల్లో జనావాసాలకు అత్యంత సమీపంలో మైనింగ్ కోసం పేలుళ్లు చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని, పేలుళ్లు దాటికి ఇళ్లకు బీటలు వారి ఆర్థికంగా నష్టపోతున్నామని బాధితుల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన పర్యావరణ ప్రమాణాలను అన్ని మైనింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
• బాధితుల భాగస్వామ్యంతో పరిష్కార మార్గాలు
కాలుష్క నియంత్రణ మండలి తనిఖీ ప్రక్రియ ప్రజలకు అర్థం కాకుండా ఒక బ్రహ్మ పదార్థంలాగా మారిపోయింది. దీంతో క్షేత్ర స్థాయిలో కాలుష్య సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు బాధితులను కూడా తనిఖీ కమిటీలో భాగస్వామ్యం చేస్తే… తనిఖీలు పారదర్శకంగా జరగడంతోపాటు బాధితులకు న్యాయం జరుగుతుంది.
• ఎవరికీ మినహాయింపులు లేవు
శబ్ద కాలుష్యం నియంత్రణలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు, కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనలు పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలు కచ్చితంగా పాటించాలి. ఇండస్ర్టియల్, కమర్షియల్, రెసిడెన్సియల్, సెన్సిటివ్ జోన్లలో నిర్దేశిత డెసిబెల్ పరిమితులను కచ్చితంగా పాటించాలి. ప్రార్థనా మందిరాలైనా జోన్ల వారీగా నిర్దేశించిన శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సిందే… ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు.
• వైట్ కేటగిరి పరిశ్రమలు కూడా కాలుష్యం వెదజల్లుతున్నాయి
నెల్లూరు జిల్లాలో కొన్ని పరిశ్రమలు వైట్ కేటగిరి కింద రిజిస్టర్ అయి, నిబంధనలకు విరుద్ధంగా దుర్వాసన, కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. బయటకు అస్సలు కాలుష్యం కలిగించని పరిశ్రమలు అని చెప్పుకుంటూ ఆర్గానిక్ వేస్ట్, రసాయన వ్యర్ధాలను బయటకు వదులుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపి పరిశ్రమల నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే సాంకేతికతను వాడి దుర్వాసన తగ్గించే పద్ధతులను పాటించేలా చేయాలి.
• కాలుష్య కోరల్లో గోస్తనీ నది
గోస్తనీ నది తీవ్రమైన కాలుష్యం బారిన పడింది. పాలకోడేరు మండలం వేండ్ర గ్రామ పరిధిలో సేకరించిన నీటి నమూనాలలో బయోలాజికల్ ఆక్సిజెన్ డిమాండ్ 15 mg/l చేరడం అనేది పర్యావరణ అత్యవసర పరిస్థితిని సూచిస్తోంది. ఈ నమూనాల ప్రకారం కాలుష్యం అనుమతించదగిన స్థాయి కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. పరిశ్రమల నుంచి నేరుగా నదిలోకి వచ్చే మురుగు, రసాయన వ్యర్ధాలను డ్రోన్, వీడియో కెమెరాల ద్వారా రికార్డ్ చేసి సంబంధిత పరిశ్రమలను బాధ్యులను చేయాలి.
• నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం విజయవంతం చేద్దాం
గాలి నాణ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం. దేశంలో అత్యంత కాలుష్యపూరిత నగరాలలో ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాల స్థాయిలను 40 శాతం వరకు తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 13 నగరాలు ఎంపిక చేసి దాదాపు రూ. 400 కోట్ల నిధులను కేటాయించారు. వాటిని జాగ్రత్తగా వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల”ని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరతపై అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకురాగా.. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే సంబంధిత ఫైలును ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.

Related posts

Vizagvision Visakhapatnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 వసంతాలు అయింది. త్యాగరాజ స్వామి భక్తుడైన సుసర్ల సూర్య భగవత్ శంకర శాస్త్రి గారు సంకల్పం విశాఖపట్నంలో ఒక సాంస్కృతిక కేంద్రం ఉండాలని అది నెరవేర్చే దిశలో శ్రీ సి.ఎస్.ఎన్. రాజుగారు, Dr. గోపాల్ శాస్త్రి గారు, శ్రీ డివి సుబ్బారావు గారు, శ్రీ వి.సీతారామయ్య గారు, శ్రీ Ch.V జోగారావు గారు ఇలాంటి పెద్దలు ట్రస్టుగా ఏర్పడి నిర్మించిన కళాక్షేత్రమే ఈ కళాభారతి. అప్పటినుంచి ఇప్పటివరకు కొన్ని వేల కచేరీలు, నృత్య కార్యక్రమాలు, నాటకాలు, సాహితీ కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు, త్యాగరాజ ఉత్సవాలు , వాగ్దేయ కార్ల ఉత్సవాలు ఈ వేదికపై నిర్వహించడం జరిగింది. భారతరత్నలు, పద్మ విభూషణలు, పద్మభూషణలు, పద్మశ్రీలు, సంగీత కళానిధులు, ఇంకా ప్రపంచవ్యాప్తి చెందిన ప్రఖ్యాత కళాకారులు ఈ వేదికపై ప్రదర్శనలు ఇచ్చి విశాఖపట్నం ని కళాభారతి ద్వారా కళలకి కేంద్రం అయింది. విశాఖ వాసులందరికీ అటువంటి కళాకారుని పరిచయం చేసే భాగ్యం కళాభారతి ట్రస్ట్ వారికి దక్కింది అని కళాభారతి అధ్యక్ష కార్యదర్శులు అన్నారు.ఈ సంవత్సరం నాలుగు దశాబ్దాలు నిండిన కళాభారతి సంగీత సేవకు అనుగుణంగా ఆరు రోజులు పాటు అత్యంత ఉన్నత స్థాయి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని దానికి ముఖ్యఅతిథిగా ఒడిస్సా గవర్నర్ గారు H.E.శ్రీ కే హరి బాబు గారు 27వ తారీఖున జరగబోయే “నాట్య విద్యా భారతి” బిరుదు సత్కార సభకి ముఖ్యఅతిథిగా వస్తున్నారు అని మంతేనా సత్యనారాయణ రాజు అధ్యక్షులు తెలియజేశారు. అలాగే 26 వ తేదీన Vice Admiral Sanjay Bhalla ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారని తెలిపారు.ముందుగా ఆరు రోజుల ఉత్సవాల ఆహ్వాన పత్రికను అధ్యక్షులు MSN రాజు , కార్యదర్శి డాక్టర్ రాంబాబు , కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్, ట్రస్టీ మల్లికా మనోజ్ గ్రంథి , ట్రస్టీ శ్రీ ఎస్ రామగోపాల్ , పంతుల నర్సింగరావు & మేనేజర్ మోహన్ దాస్ ఆవిష్కరించారు.తర్వాత ప్రధాన కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ మొదట రోజు (22/8/2026) న ప్రఖ్యాత గాత్ర విద్వాంసరాలు ఈ వారంలోనే సంగీత నాటక అకాడమీ పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని మన విశాఖకే గర్వకారణమైన కళాకారిణి డాక్టర్ పంతుల రమ గారి గాత్ర కచేరితో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు రెండవ రోజున(23/8/2026) సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారధ్యంలో విజయవాడ వారు : “జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్” చారిత్రాత్మాక నాటకాన్ని 60 మంది కళాకారులతో అత్యంత భారీ సెట్టింగ్లతో ప్రదర్శించబోతున్నారని అన్నారు. మూడో రోజున (24/8/2026) ప్రఖ్యాత హిందుస్తానీ విద్వాంసులు ,ఢిల్లీ, కాశ్మీర్, కలకత్తా నుంచి వచ్చి హిందుస్తానీ గాత్ర & సరోద్ వాయిద్య జుగల్బంది కచేరి చేయబోతున్నారని అన్నారు. నాలుగవ రోజు(25/8/2026) ప్రపంచ ఖ్యాతిగాంచిన ప్రఖ్యాత గాత్ర విద్వాంసులు త్రిచూర్ బ్రదర్స్ చెన్నై నుంచి వచ్చి అద్భుత కచేరి చేయనున్నారని అన్నారు .ఐదవ రోజున (26/8/2026) సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీ మైసూర్ మంజునాథ్, వారి కుమారుడు విద్వాన్ సుమన్ మంజునాథ్ కలిసి వైలెన్ ద్వయం కచేరి ఉంటుందని అన్నారు. ఆఖరి రోజున (27. 8 .2026) సాయంత్రం 6:30 గంటలకు విఎండిఏ ప్రతిస్టాత్మకంగా ఇచ్చే వార్షిక బిరుదు ప్రధానం “నాట్య విద్యా భారతి” బిరుదును 84 ఏళ్ల భరతనాట్య కళాకారిణి , పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం గారికి ప్రధానం చేయనున్నామని,, ముఖ్యఅతిథిగా H.E డాక్టర్ కే హరి బాబు గారు గవర్నర్ ఒడిశా వచ్చి వారి చేతుల మీదుగా ప్రధానోత్సవం జరుగుతుందని, అలాగే రెండున్నర లక్షలు విలువ చేసే వైభవ్ జ్యువెలర్స్ స్పాన్సర్ చేస్తున్న “స్వర్ణకమలం”, లక్ష రూపాయల నగదు బహుమతి ,ప్రశంసా పత్రం, నూతన వస్త్రాలు, కర్పూర మాలలతో పురస్కార గ్రహీతను ఘనంగా సత్కరించనున్నామని అన్నారు. పైన చెప్పిన ఆరు రోజుల కార్యక్రమాలు అత్యంత ఉన్నత స్థాయివని ఖర్చుక వెనకాడకుండా గొప్పవిద్వాంసులను ఆహ్వానించడం జరిగిందని సంగీత ప్రియులు, కళాకారులు , కళాభిమానులు ప్రతి ఒక్కరూ ఆరు రోజులు విచ్చేసి కార్యక్రమాలు వీక్షించి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు .ప్రతిరోజు రాత్రి భోజన రూపేనా ప్రసాదాలు ఏర్పాటు చేశామని కూడా అన్నారు .ఈ కార్యక్రమానికి బిరుదు ప్రధానోత్సవం రోజున(27/8/2026) జరిగే కార్యక్రమానికి S R K Infra Projects Pvt.Ltd chairman శ్రీ ఎం ఎస్ ఎం రాజు రెండున్నర లక్షలు స్పాన్సర్ చేస్తున్నారని , అదే రోజున మరొక రెండు లక్షల విలువ చేసే స్వర్ణకమలం వైభవ్ జ్యువెలర్స్ స్పాన్సర్ చేస్తున్నారని , నూతన వస్త్రాలు కంకటాల సిల్క్ వారు స్పాన్సర్ చేస్తున్నారని , ఈ కార్యక్రమాలు విజయానికి , శ్రీ సి ఎస్ ఎన్ రాజుగారు, శ్రీ డి ఎస్ ఎన్ రాజు ట్రస్ట్, MRC ప్రాజెక్ట్స్ మరియు కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ కే. రాంబాబు గారు అలాగే తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ కంపెనీవారు, పైడా కృష్ణ ప్రసాద్ గారు అన్నం రాజు సత్యనారాయణమూర్తి గారు ప్రాయోజకులుగా సహకారం అందిస్తున్నారని అన్నారు ఈ ఆరు రోజుల గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేరని మరొకసారి ఉద్ఘాటించారు.ప్రతిరోజు సాయంత్రం 6:30 కి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు.పత్రిక విలేకరుల అందర్నీ వారు చేస్తున్న కృషికి ప్రశంసిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని రామప్రసాదంగా అయోధ్య నుంచి వచ్చిన స్కార్ఫ్తో సన్మానించారు అధ్యక్ష కార్యదర్శులు మిగతా సభ్యులుశ్రీరామదాస డాక్టర్ రాంబాబు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ

Vizag Vision Visakhapatnam:గణిత విజ్ఞాన మేళా – సంస్కృతి మహోత్సవ్ శ్రీకృష్ణ విద్యా మందిర్, విశాఖపట్నంభారతీయ విద్యకు ప్రముఖ కేంద్రమైన శ్రీకృష్ణ విద్యా మందిర్ నందు నేడు “గణిత విజ్ఞాన మేళా – సంస్కృతి మహోత్సవ్”కార్యక్రమానికి అంగరంగ వైభవంగా నాంది పలకడం జరిగింది.*ముఖ్య అతిథులు: *ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు*, చైర్మన్,శ్రీమతి ఈశ్వర ప్రభాకర గారు,శ్రీ సుబ్బారావు గారు*, భారతీయ విద్యా ప్రముఖులు,వి.వి.ఎన్ ఆచార్యులు గారు,బి. నారాయణ రావు గారు*, సమితి ముఖ్య ప్రముఖులు,శ్రీ చిరంజీవి గారు పాఠశాల ప్రిన్సిపల్ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. పాఠశాల విద్యార్థులు ప్రార్థనా గీతంతో సభను అలరించారు విజ్ఞాన మేళాలో *గణితం, సైన్స్, సంస్కృత బోధన*కు సంబంధించిన ప్రయోగాత్మక కార్యక్రమాలు మరియు *మట్టి బొమ్మల తయారీ* కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి.విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ మేళా మూడు స్థాయిలలో నిర్వహించబడుతుంది. పాఠశాల స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన విద్యార్థులు ప్రాంత స్థాయికి, ప్రాంత స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన వారు క్షేత్ర స్థాయికి,క్షేత్ర స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన వారు జాతీయ స్థాయికి ఎంపికై వెళ్లనున్నారు.ఈ కార్యక్రమాన్ని *విద్యా భారతి* సంస్థ అధినేతలు ఎంతో వైభవంగా నిర్వహిస్తుండడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఈ విజ్ఞాన మేళా ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

Vizagvision Anakapalli : మర్తి లో ఫైజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ ప్రజాస్పందనలేమర్తి , అనకాపల్లి జిల్లా, ఆగస్టు 13, 2026: ప్రముఖ బహుళజాతి ఔషధ మరియు బయోటెక్నాలజీ సంస్థ ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శంకర్ ఫౌండేషన్ సహకారంతో, తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, లేమర్తి గ్రామంలో సమగ్ర ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని ఫైజర్ సైట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫైజర్ సంస్థకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారిలో శ్రీ రవి పోలిశెట్టి, క్వాలిటీ హెడ్; శ్రీ రాజేష్ రావూరి, ఫైనాన్స్ హెడ్; శ్రీ సత్జీత్ సింగ్, ఐటీ హెడ్; శ్రీ ఎం.వి. రామరాజు, పబ్లిక్ అఫైర్స్ & CSR హెడ్; మరియు డా. పి. ఈశ్వర్ రావు, మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. వీరితో పాటు శంకర్ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రవి చందర్ కట్టా మాట్లాడుతూ, శిబిరానికి హాజరైన లబ్ధిదారులు ఈ కంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, నివారించగల అంధత్వాన్ని అరికట్టేందుకు అందిస్తున్న సేవలను పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరారు. సమాజానికి శంకర్ ఫౌండేషన్ అందిస్తున్న అంకితభావంతో కూడిన సేవలను ఆయన అభినందించారు. అర్హులైన లబ్ధిదారులకు అక్కడికక్కడే కళ్లద్దాలను అందిస్తున్న శంకర్ ఫౌండేషన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేస్తూ, వెనుకబడిన వర్గాల ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించడంలో శంకర్ ఫౌండేషన్ చూపిస్తున్న నిబద్ధతను ఆయన అభినందించారు.ఫైజర్ సంస్థకు చెందిన అధికారులు శిబిరంలోని ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని సమర్థవంతంగా మరియు విజయవంతంగా నిర్వహించినందుకు శంకర్ ఫౌండేషన్ను అభినందించారు. అనంతరం శిబిరానికి హాజరైన రోగులకు కళ్లద్దాలు మరియు మందులను పంపిణీ చేశారు. లేమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మరియు పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ జె. నాగేశ్వరరావు శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తమ పూర్తి సహకారాన్ని అందించారు.ఈ కంటి పరీక్షా శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సమాజంలోని ప్రజల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, నివారించగల అంధత్వాన్ని తగ్గించడం పట్ల ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు శంకర్ ఫౌండేషన్ కలసి చూపిస్తున్న నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.కంటి శిబిరం ముఖ్యాంశాలు : శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (PR, Liaison & Corporate Relations) శ్రీ కె. బంగార్రాజు మాట్లాడుతూ, సమీప గ్రామాల నుంచి ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందని, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.• 535 మంది ఔట్పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించారు • 360 మందికి కళ్లద్దాలు సూచించారు • 350 మందికి అక్కడికక్కడే కళ్లద్దాలు అందజేశారు • 42 మంది రోగులను కంటి శుక్లం (క్యాటరాక్ట్) శస్త్రచికిత్సలు మరియు ఇతర చికిత్సా విధానాలకు గుర్తించారు , వీరిని నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి శస్త్రచికిత్సల కోసం తరలించారు.• 170 మంది రోగులకు మందులు అందజేశారువైద్య బృందం & సహాయక సిబ్బంది: రోగులకు కంటి పరీక్షలను శంకర్ ఫౌండేషన్కు చెందిన డా. యధార్థ్ మరియు డా. అన్నా జోసెఫ్ నిర్వహించారు. ఈ కంటి శిబిరాన్ని శ్రీ ఎన్. అప్పల రాజు (సీనియర్ మేనేజర్ – అవుట్రీచ్) నాయకత్వంలో, శ్రీ అరుణ్ కుమార్, మేనేజర్; శ్రీ ఈశ్వర్ రావు (సీనియర్ మేనేజర్); శ్రీ రాము (సీనియర్ మేనేజర్ – ఆప్టికల్ మేనేజ్మెంట్); శ్రీ రతన్ రాజు (మేనేజర్ – ఆప్టోమెట్రీ విభాగం); శ్రీమతి శ్రుతి (CR); మరియు శ్రీమతి హరిత, ఫార్మసిస్ట్ కూడిన అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు మరియు పారామెడికల్ సిబ్బంది బృందం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించింది.ఫోటో క్యాప్షన్: 1. ఫైజర్ యూనిట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా ప్రసంగిస్తున్న దృశ్యం.2.ఫైజర్ యూనిట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా రోగులకు కళ్లద్దాలను పంపిణీ చేస్తున్న దృశ్యం. 3.శ్రీ రవి చందర్ కట్టా మరియు ఫైజర్ అధికారులు ఈ రోజు కంటి శిబిరాన్ని ప్రారంభిస్తూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం. (K.BANGAR RAJU )DEPUTY GENERAL MANAGER (PR , LIAISON & Corporate Relations)Sankar Foundation Eye Hospital & InstitutePh.no.98481 89378