Vizagvision Visakhapatnam :పాస్ ఎన్ టైల్స్ దశాబ్ది వేడుకలు….పెద వాల్తేరులోని ‘పాస్ ఎన్ టైల్స్’ (Paws N Tails) ప్రీమియం పెట్ హాస్పిటల్ దశాబ్ది (2016-2026) వేడుకలను ఆసుపత్రి వ్యవస్థాపకులు, చీఫ్ వెటర్నరీ సర్జన్ *డాక్టర్ నెరళ్ల శ్రీధర్* మరియు వారి బృందం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ *డాక్టర్ శంఖబ్రత బాగ్చీ*, ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విశిష్ట అతిథులుగా ఆనంద్ (గుజరాత్) పీజీ స్టడీస్ డైరెక్టర్ *డాక్టర్ డి.బి. పాటిల్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. నీలయ్య*, డిప్యూటీ డైరెక్టర్ *డాక్టర్ ఎ. రవికుమార్* పాల్గొన్నారు.ముఖ్య అతిథి చేతుల మీదుగా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక *’అల్ట్రాసౌండ్ మెషిన్’* ప్రారంభమైంది. ఇది ఆసుపత్రిలోని అధునాతన వ్యాధి నిర్ధారణ సౌకర్యాలను మరింత బలోపేతం చేయనుంది. అలాగే, ఆగస్టు 28, 29 తేదీల్లో కుక్కలు, పిల్లుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల *’పెట్ ఆప్తాల్మాలజీ క్యాంప్*(కంటి వైద్య) శిబిరాన్ని కూడా ప్రారంభించారు. మొదటి రోజు దాదాపు 20 పెంపుడు జంతువులను పరీక్షించి, వివిధ కంటి సమస్యలకు నిపుణులతో సంప్రదింపులు, చికిత్స సిఫార్సులను అందించారు.ఈ సందర్భంగా డాక్టర్ నెరళ్ల శ్రీధర్ మాట్లాడుతూ.. కేవలం 900 చదరపు అడుగుల చిన్న క్లినిక్గా ప్రారంభమైన పాస్ ఎన్ టైల్స్, నేడు 2,100 చదరపు అడుగుల ప్రీమియం పెట్ హాస్పిటల్గా ఎదిగిన అద్భుత ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. తమకు నిరంతరం మద్దతుగా నిలిచిన పెంపుడు జంతువుల యజమానులకు, సిబ్బందికి మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూ.. పాస్ ఎన్ టైల్స్ బృందం అంకితభావాన్ని అభినందించారు. జంతువులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి అన్ని వసతులు గల మల్టీస్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రుల అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు. జంతు సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషిని కొనియాడారు.ఈ వేడుకల్లో భాగంగా, మూగజీవాలకు అలసట లేకుండా సేవలు అందిస్తున్న రెండు జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థలను (NGOs) ఘనంగా సత్కరించారు.ఈ దశాబ్ది వేడుకలు ఆగస్టు 29 సాయంత్రం 4:00 గంటలకు కూడా కొనసాగనున్నాయి. హోటల్ రాక్డేల్లో జరిగే కార్యక్రమంలో డాక్టర్ డి.బి. పాటిల్ “కుక్కలు మరియు పిల్లుల వెటర్నరీ వైద్యంలో ఆధునిక పోకడలు” అనే అంశంపై ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 80 మంది పెంపుడు జంతువుల యజమానులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.