Vizagvision Visakhapatnam:ENC CONDUCTS SEMINAR ON “SUBMARINE SONARS – ROADMAP FOR ENHANCED EXPLOITATION”A professionally intriguing seminar on “Submarine Sonars – Roadmap for Enhanced Exploitation” was conducted at Visakhapatnam on 03 Jul by SMHQ under the aegis of Eastern Naval Command.Chaired by VAdm Susheel Menon, Chief of Staff, Eastern Naval Command, the seminar brought together industry experts who are spearheading new projects, war fighters who have mastered theart of operating new generation sonars being designed under Aatmanirbhar Bharat, system maintainers, domain experts from academia, and design institutions. Papers were presented oncontemporary topics of submarine sonar exploitation, HR optimisation of operators, new concepts in database management and incorporation of emerging technologies. A compendium of papers submitted by Indian sonar designers and skilled operators of submarines was also released.The seminar, steered by Flag Officer Submarines provided a platform for discussing methodologytowards advancement in design and built of sonars and technology for data-fusion.

Related posts

Vizag Vision Visakhahapatnam: మణిహారం.. భోగాపురం విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభోత్సవ వేడుకలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి*విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మిత‌మైన‌ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనుందని, ఆగస్టు 1న జరగనున్న ప్రారంభోత్సవ వేడుకను చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆధ్వ‌ర్యంలో శ‌నివారం జ‌రిగిన‌ స‌మీక్ష‌లో స్థానిక ఎమ్మెల్యేల‌తో క‌లిసి పాల్గొన్న ఆయ‌న‌ అనంత‌రం క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో భోగాపురం ఎయిర్ పోర్టు కు సంబంధించిన వివ‌రాల‌ను హోం మంత్రి అనిత‌తో క‌లిసి వెల్ల‌డించారు.*ఉత్తరాంధ్ర నుంచి భారీగా ప్రజల భాగస్వామ్యం*భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి సుమారు లక్ష మంది, ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు మూడు లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రజల భద్రత, సౌకర్యం, రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. విశాఖపట్నం నగరానికి దూరంగా విమానాశ్రయం నిర్మించారనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నప్పటికీ, భవిష్యత్‌ జనాభా పెరుగుదల, ప్రాంతీయ విస్తరణ, అంతర్జాతీయ విమానయాన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక దృష్టితో ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు స్ప‌ష్టం చేశారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భోగాపురం విమానాశ్రయం నిర్మితమైందని పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్‌ తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారని, సందర్శించే ప్రతి ఒక్కరికీ దాని విస్తృతి, నాణ్యత, భవిష్యత్‌ దృష్టి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఉత్తరాంధ్రను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లే కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా ఈ విమానాశ్రయం నిలుస్తుందని అన్నారు.*ఉత్తరాంధ్ర సంస్కృతికి అద్దం పట్టే సాంస్కృతిక కార్యక్రమాలు*ప్రారంభోత్సవ వేడుకల్లో ఉత్తరాంధ్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయ‌న తెలిపారు. ప్రసిద్ధ థింసా నృత్యంతో పాటు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కేవలం ఒక మౌలిక వసతుల ప్రాజెక్టు ప్రారంభం మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో కొత్త అధ్యాయానికి నాంది అని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.*అసిప్ సెమీ కండెక్ట‌ర్ టెక్నాల‌జీ సంస్థ‌కు శంకుస్థాప‌న‌*విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా ఏర్పాటు కానున్న ప్ర‌పంచ స్థాయి గుర్తింపు పొందిన అసిప్(ASIP) టెక్నాల‌జీస్ సెమీ కండ‌క్ట‌ర్ సంస్థ‌కు ఆగ‌స్టు 01న ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంద‌ని ప‌ల్లా శ్రీనివాస‌రావు వివరించారు. ఆ రోజు ఎయిర్ పోర్టుతో పాటు, ఏవియేషన్ హ‌బ్ – యూనివ‌ర్శిటీ, ఎడ్యుసిటీలు, జీఎంఆర్ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ కూడా ప్రారంభ‌మ‌వుతాయ‌ని, వాటితో పాటు అసిప్ టెక్నాల‌జీ సంస్థకు శంకుస్థాపం కూడా జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీపీ శంఖ‌బ్ర‌త బాగ్చీ, జీవీఎంసీ క‌మిష‌న‌ర్ కేత‌న్ గార్గ్ విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్నారు……

VizagVision Visakhapatnam:సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్ ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా రంగంలో PM e- Bus Sewa తో నూతన శకం మొదలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు. రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్‌ను ప్రారంభించి, డిపోలో ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలి ఏకాదశి రోజున రాష్ట్రం లో మొదటి E – బస్ పవర్ రూమ్ ప్రారంభం నూతన శకానికి నాంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేపట్టడంపట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు. PM e-Bus Sewa పథకం కింద రాష్ట్రానికి తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు రానుండగా, అందులో విశాఖపట్నానికి 100 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు నగరాల్లో దశలవారీగా ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం సంస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం మంత్రిగారిని డిపో కమిటీలు, కార్మికుల సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు, ఇంజినీర్లు, డిపో మేనేజర్లు, ఉద్యోగులు, వివిధ ఆర్టీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Vizagvision Visakhapatnam: