Vizag Vision Mumbai:

ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు

అవార్డుల కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• దేశంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత నేను ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను
• నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారత దేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాను.
• సంస్కరణలకు అనుగుణంగానే విజన్ 2020ను అమలు చేశాం. ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్న అభివృద్ధి ఫలాలు అవే.
• ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు 2047 వికసిత్ భారత్ రూపకల్పన చేశారు. అందులో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే నా ఆకాంక్ష
• 1990లో వచ్చిన ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నాం. ఇప్పుడు క్వాంటం, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేశాయి
• ఇప్పుడు ఆ టెక్నాలజీలను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాల్సి ఉంది
• గతంలో విద్యుత్ సంస్కరణల్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి మిగులు విద్యుత్ సాధించాం
• రాష్ట్రంలో వినియోగదారులకు మేలు కలిగేలా నియంత్రణా కమిషన్ ను కూడా తీసుకువచ్చాం.
• సౌర, పునరుద్పాదక విద్యుత్ కు కూడా పెద్ద ఎత్తున భారత్ లో ప్రోత్సాహం కల్పించాం
• ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ అమ్మోనియా లాంటి రంగాల్లో విద్యుత్ ఉత్పత్తి కావాలి
• అప్పుడే ఇంధన రంగంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. డీజిల్, పెట్రోలు, గ్యాస్ లాంటి ఇంధనాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి అనేది కీలకం
• తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తేనే మనకు ప్రయోజనాలు ఉంటాయి
• 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన చేయాలని ప్రధాని లక్ష్యం విధిస్తే అందులో ఏపీ 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నాం
• ఇప్పటికే 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా ముందడుగు వేశాం.
• ప్రోజ్యూమర్ అనే విధానంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పాదన చేసి త్వరలోనే ఎగుమతులు సాధించగలుగుతాం
• గతంలో సౌర విద్యుత్ ప్యానళ్ల కోసం చైనాపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు వాటిని దేశీయంగానే ఉత్పత్తి చేయగలుగుతున్నాం
• గ్రీన్ అమ్మోనియా లాంటి వాటి ద్వారా ఈ ఇంధన లక్ష్యాలను చేరుకోగలుగుతాం
• డేటా సెంటర్లకు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. గూగుల్ సంస్థ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది
• 28న మేం విశాఖలో గూగుల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నాం
• ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం చేయటం ద్వారా దేశానికి టెక్ క్యాపిటల్ ను ఏర్పాటు చేయగలిగాం
• ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం దక్కింది
• ఫ్యూచర్ సిటీగా గ్రీన్, బ్లూ సిటీ, నెట్ జీరో కాన్సెప్టుతో హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం
• సంస్కరణలు సంపదను సృష్టిస్తాయి. రెవెన్యూ వస్తేనే సంక్షేమం చేయగలం.
• అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కీలకమైన అంశం
• మన సమాజం కేవలం మిలియనీర్లు, బిలియనీర్ల కోసం మాత్రమే కాదు. సాధారణ ప్రజలది కూడా
• అందుకే పీ4 పేరిట వారిని ఆదుకునేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమానికి కూడా రూపకల్పన చేశాం
• సమాజంలో ప్రతీ ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందాలి. ఆ కోణంలోనే మా చర్యలు ఉంటాయి
• ఎంబీకే 10-20 అనే ఫార్ములాతో సమాజంలో అట్టడుగున ఉండిపోయిన వారిని సంపద ఆర్జించిన వారు ఆదుకోవటమే ఈ కార్యక్రమం
• భారత్ కు అత్యుత్తమ పెర్ఫార్మర్- రిఫార్మర్ గా ప్రధాని మోదీ ఉన్నారు.

Related posts

Vizagvision Visakhapatnam:CNS UNDERTAKES MAIDEN VISIT TO ENC Admiral Krishna Swaminathan, CNS, undertook his maiden visit to Eastern Naval Command after assuming charge as CNS. He was briefed by Vice Admiral Sanjay Bhalla, FOCinC(East), on the prevailing maritime security environment, the Command’s operational preparedness and ongoing operational commitments across the Eastern seaboard and the Indian Ocean Region. Addressing officers and sailors, the CNS commended the Command’s high standards of operational readiness, professionalism and unwavering commitment to safeguarding India’s maritime interests.

Vizagvision Visakhapatnam:

Vizagvision Visakhapatnam: