ఫైజర్, శంకర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం
అనకాపల్లి జిల్లా,పరవాడ మండలం, తానాం గ్రామం : గ్రామీణ ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రముఖ బహుళజాతి ఔషధ, జీవసాంకేతిక సంస్థ ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా, శంకర్ ఫౌండేషన్ సహకారంతో శుక్రవారం (జూన్ 26, 2026) తానాం గ్రామంలోని సామాజిక భవనం ప్రాంగణంలో సమగ్ర ఉచిత కంటి వైద్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా శంకర్ ఫౌండేషన్ డీజీఎం – ప్రజా సంబంధాలు, అనుసంధానం & కార్పొరేట్ సంబంధాల విభాగంకు చెందిన కె. బంగార్రాజు మాట్లాడుతూ, ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి స్థానిక ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా విశేష స్పందన లభించిందని తెలిపారు.
ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం యూనిట్ అధిపతి శ్రీ రవి చందర్ కట్ట ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఫైజర్ విశాఖపట్నం యూనిట్ అధిపతి శ్రీ రవి చందర్ కట్ట మాట్లాడుతూ, శంకర్ ఫౌండేషన్తో భాగస్వామ్యంగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలను చేరువ చేయడంలో శంకర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మరింత మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు భవిష్యత్తులో కూడా శంకర్ ఫౌండేషన్తో తమ భాగస్వామ్యాన్ని కొనసాగించాలని ఫైజర్ సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం ఫైజర్ అధికారులు శిబిరాన్ని సందర్శించి, వైద్య సేవల నిర్వహణ, రోగులకు అందించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ శిబిరాన్ని సమర్థవంతంగా నిర్వహించినందుకు శంకర్ ఫౌండేషన్ వైద్య బృందం, నిర్వాహకులను అభినందించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫైజర్ సంస్థకు చెందిన, ,విజయ్ మహాజన్ (తయారీ విభాగ అధిపతి), విజయ భాస్కర్ ( సైప్లై చైన్ హెడ్) , ఎం.వి. రామరాజు (ప్రజా సంబంధాలు & CSR అధిపతి), అరవింద్ జయరామన్ (పర్యావరణ, ఆరోగ్యం & భద్రత (EHS) విభాగ అధిపతి), డాక్టర్ ఈశ్వర్ రావు , ఎన్ హనుమంత రావు నాగేశ్వరారావు సి ఎస్ ఆర్ టీం పాల్గొన్నారు. ఈ కార్యక్రమా నికి పైలా జగన్నాథం , గ్రామా సర్పంచ్ వెంకట రమణ సహాయ సహకారాలను అందించి శంకర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు .
కంటి వైద్య శిబిరం యొక్క ముఖ్యాంశాలు: తానాం గ్రామంతో పాటు సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. గ్రామీణ ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో శిబిరం విజయవంతంగా కొనసాగింది. అర్హులైన రోగులను తదుపరి చికిత్సలు, అవసరమైన శస్త్రచికిత్సల కోసం శంకర్ ఫౌండేషన్కు రిఫర్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
వైద్య బృందం & సహాయ సిబ్బంది :
శంకర్ ఫౌండేషన్కు చెందిన డాక్టర్ వై. సాయి మరియు డాక్టర్ జోసెఫ్ రోగులకు స్క్రీనింగ్లు నిర్వహించారు. ఈ శిబిరానికి శ్రీ ఎన్. అప్పల రాజు (సీనియర్ మేనేజర్ – ఔట్రీచ్), శ్రీ అరుణ్ కుమార్, మేనేజర్ (ఔట్రీచ్), శ్రీ ఈశ్వర్ రావు (సీనియర్ మేనేజర్), శ్రీ రాము (సీనియర్ మేనేజర్ – ఆప్టికల్ మేనేజ్మెంట్), శ్రీ రతన్ రాజు (మేనేజర్ – ఆప్టోమెట్రీ విభాగం) మరియు ఇతరులతో కూడిన అంకితభావం గల ఉద్యోగులు మరియు పారామెడికల్ సిబ్బంది బృందం మద్దతు ఇచ్చింది.
ఈ శిబిరానికి సమీప గ్రామాల నుండి అద్భుతమైన స్పందన లభించింది, అలాగే స్థానిక సమాజం నుండి కూడా గణనీయమైన భాగస్వామ్యం నమోదైంది. శిబిరం ముఖ్యాంశాలు:
• 391 మంది ఔట్ పేషెంట్లకు స్క్రీనింగ్
• 305 కళ్లద్దాలు సూచించబడ్డాయి
• 280 కళ్లద్దాల స్పాట్ డెలివరీ
• 25 కళ్లద్దాలు డెలివరీ కానున్నాయి
• కంటి శస్త్రచికిత్సల కోసం 33 మంది రోగులు ఎంపికయ్యారు
• 70 మంది రోగులకు మందులు అందించబడ్డాయి