Uncategorized Vizag Vision Visakhapatnam:శ్రీ కంచి కామకోటి పీఠం శంకరాచార్య స్వామి స్థాపించిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం (డీమ్డ్ యూనివర్సిటీ), కాంచీపురం లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, ఆయుర్వేదం, మేనేజ్మెంట్, లా మహిళలు అలైడ్ హెల్త్ సైన్సెస్, సంస్కృతం, బిఎడ్ ఇతర యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు.గత 33 సంవత్సరాలకు పైగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ విద్యాలయంలో ప్రవేశాలకోసం జూన్ 6 శనివారం విశాఖపట్నం, ద్వారకానగర్, శ్రీ కంచి కామకోటి శంకర మఠంలో, సాయంత్రం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు స్పాట్ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జీ శ్రీనివాసు,డీన్ ఆచార్య కే . వెంకట రమణ, పాల్గొని విశ్వవిద్యాలయం, కోర్సులో ప్రవేశ విధానం, ఉపాధి అవకాశాల గురించి వివరాలను తెలియజేస్తారని ప్రకటనలో తెలిపారు.ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్ పద్ధతిలో ప్రవేశాలు లభిస్తాయని విద్యార్థులకు శాకాహార భోజనం, జిమ్, ఆధునిక క్రీడా మైదానాలు, ఉత్తమ వసతి సౌకర్యాలు, ఆకర్షణీయమైన ప్లేస్మెంట్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కంచి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థులలో 70 శాతానికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారే విద్యనభ్యసిస్తున్నారని అర్హతకలిగి ఆసక్తి కలిగిన విద్యార్థులకు తక్షణ స్పాట్ అడ్మిషన్లు లభిస్తాయని ప్రకటనలో తెలిపారు.మరిన్ని వివరాల కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు,కంచియూనివ.ఏసీ.ఇన్ వెబ్ సైట్ లో లేదా యూనివర్సిటీ కార్యాలయం ఫోన్ నెంబర్ 9629001144, ఆయుర్వేద కోర్సుల వివరాలకు 8098001630, స్థానిక సంప్రదింపులకోసం 98480 90255 నెంబర్ లను సంప్రదించాలని కోరారు.విశాఖపట్నం పరిసర ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. by Deva Trinadh Rao June 1, 2026 by Deva Trinadh Rao June 1, 2026