Vizagvision Vijayawada:ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా డా.నేమాల నియామకంఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ (న్యూడిల్లీ)అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా విశాఖ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ డా.నేమాల హేమసుందరరావు నియమితులయ్యారు.ఈ మేరకు విజయవాడ గాంధీనగర్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియామకపత్రాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.కాకుమాను వెంకట వేణు,ప్రధాన కార్యదర్శి గాదoశెట్టి శేఖర్ బాబులచే హేమసుందర్ అందుకున్నారు.ఈ సందర్భంగా డా.నేమాల మాట్లాడుతూ తనకుఈ బాధ్యతలను అప్పగించిన యూనియన్ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతుకృషి చేస్తానన్నారు.