HomeUncategorizedVizagvision Visakhaptnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నుంచి ఆరు రోజులు పాటు సంగీత ,నృత్య ,నాటక ఉత్సవాలు జరుపుతున్నాము .ఈరోజు సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత పల్లవి చక్రవర్తి బిరుదంతురాలు సంగీత కళాభారతి బిరుదాంకితురాలు అయిన విద్వన్మని డాక్టర్ పంతుల రమ కర్ణాటక గాత్ర సంగీత కచేరి జరిగింది. కచేరీ ప్రారంభానికి ముందుగా అధ్యక్షులు MSN రాజు ,కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ , ట్రస్టీలు అన్నంరాజు మూర్తి,రమ గోపాల్ నేటి అతిధులు రాఘవేంద్రరావు దశపల్ల చైర్మన్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు అధ్యక్షులు మాట్లాడుతూ గొప్ప విద్వాంసుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, కళలని పోషించడానికి కళాభారతి కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ 40 వసంతాల ఉత్సవాలు జరుపుకోవడం అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ట్రైబల్ కళాకారులు తే కార్యక్రమం నిర్వహించాలని ప్రోత్సహించాలని సూచించారు. కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నేటి కళాకారిని విశాఖ వాస్తవ్యురాలు వారి అద్భుత గాత్రం ద్వారా సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ విశాఖకే పేరు తెచ్చిన గొప్ప కళాకారుని డాక్టర్ పంతుల రమ అని కొనియాడారు. వారికి సహకారంగా వారి భర్త ప్రముఖ వయోలిన్ విద్వాంసులు MSN మూర్తి అత్యంత ఉన్నత స్థాయిలో సహకరించారు. మృదంగంపై సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ కె వైద్యనాథన్ చెన్నై అలాగే కంజీరాపై రాజా గణేష్ TRICHI , అద్భుతమైన సహకారం అందించి కచేరీ ద్విగినేకృతం చేశారు. తన్యావర్తనల్లో పోటీపడి అద్భుతమైన లైవ్ విన్యాసం చేసి శ్రోతల ప్రశంసలను అందుకున్నారునేటి కచేరీలో ముందుగా శ్రీ విఘ్నరాజం భజే – గంభీరనాట – ఖండ చాపు ఊతుక్కాడ్ వెంకట సుబ్బయ్యర్ వారి కీర్తన గానం చేసి వినాయకుడి ఆశీస్సులు తీసుకొని తర్వాత అంశం అమ్మవారి మీద శ్రీ కమలాంబికే అంటూ – శ్రీ రాగంలో – ఖండ ఏక తాళంలో ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి శ్రావ్యంగా పాడారు. తర్వాత అంశం పరమేశ్వరుడిపై శంకర శ్రీ గిరి అంటూ – హంసానంది రాగం లో, ఆది తాళంతో స్వాతి తిరునాళ్ వారి కృతి తరువాత అంశం కొలువైయున్నాడే- భైరవి- ఆది- త్యాగరాజు స్వామి వారి కృతి గానం చేసేరు. చందమామను- యోగి నారేయణతరువాత రాగం తానం పల్లవి- కదనకుతూహలం రాగంలో – త్రిశ్ర గతి ఆది తాళం2 కళలు- పంతుల రమ గానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది హాలు నిండిన ప్రేక్షకులు వారి కరతాల ధ్వనులతో కళాకారులను అభినందించారు .కార్యక్రమం అనంతరం అందరికీ భోజన రూపేనా ప్రసాద వితరణ జరిగింది. చివరగా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఈ ఆరు రోజుల ఉత్సవాలలో రెండవ రోజు అయిన రేపు సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారథ్యంలో జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక నాటకం 60 మంది కళాకారులతో విజయవాడ నుంచి వచ్చి ప్రదర్శించబోతున్నారని అందరూ అధికంగా వచ్చి చూసి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు.శ్రీ పంతులు నరసింగరావు కార్యక్రమాన్ని నిర్వహించారు . డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ కార్యక్రమ సమీక్ష చేశారు.
Vizagvision Visakhaptnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నుంచి ఆరు రోజులు పాటు సంగీత ,నృత్య ,నాటక ఉత్సవాలు జరుపుతున్నాము .ఈరోజు సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత పల్లవి చక్రవర్తి బిరుదంతురాలు సంగీత కళాభారతి బిరుదాంకితురాలు అయిన విద్వన్మని డాక్టర్ పంతుల రమ కర్ణాటక గాత్ర సంగీత కచేరి జరిగింది. కచేరీ ప్రారంభానికి ముందుగా అధ్యక్షులు MSN రాజు ,కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ , ట్రస్టీలు అన్నంరాజు మూర్తి,రమ గోపాల్ నేటి అతిధులు రాఘవేంద్రరావు దశపల్ల చైర్మన్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు అధ్యక్షులు మాట్లాడుతూ గొప్ప విద్వాంసుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, కళలని పోషించడానికి కళాభారతి కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ 40 వసంతాల ఉత్సవాలు జరుపుకోవడం అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ట్రైబల్ కళాకారులు తే కార్యక్రమం నిర్వహించాలని ప్రోత్సహించాలని సూచించారు. కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నేటి కళాకారిని విశాఖ వాస్తవ్యురాలు వారి అద్భుత గాత్రం ద్వారా సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ విశాఖకే పేరు తెచ్చిన గొప్ప కళాకారుని డాక్టర్ పంతుల రమ అని కొనియాడారు. వారికి సహకారంగా వారి భర్త ప్రముఖ వయోలిన్ విద్వాంసులు MSN మూర్తి అత్యంత ఉన్నత స్థాయిలో సహకరించారు. మృదంగంపై సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ కె వైద్యనాథన్ చెన్నై అలాగే కంజీరాపై రాజా గణేష్ TRICHI , అద్భుతమైన సహకారం అందించి కచేరీ ద్విగినేకృతం చేశారు. తన్యావర్తనల్లో పోటీపడి అద్భుతమైన లైవ్ విన్యాసం చేసి శ్రోతల ప్రశంసలను అందుకున్నారునేటి కచేరీలో ముందుగా శ్రీ విఘ్నరాజం భజే – గంభీరనాట – ఖండ చాపు ఊతుక్కాడ్ వెంకట సుబ్బయ్యర్ వారి కీర్తన గానం చేసి వినాయకుడి ఆశీస్సులు తీసుకొని తర్వాత అంశం అమ్మవారి మీద శ్రీ కమలాంబికే అంటూ – శ్రీ రాగంలో – ఖండ ఏక తాళంలో ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి శ్రావ్యంగా పాడారు. తర్వాత అంశం పరమేశ్వరుడిపై శంకర శ్రీ గిరి అంటూ – హంసానంది రాగం లో, ఆది తాళంతో స్వాతి తిరునాళ్ వారి కృతి తరువాత అంశం కొలువైయున్నాడే- భైరవి- ఆది- త్యాగరాజు స్వామి వారి కృతి గానం చేసేరు. చందమామను- యోగి నారేయణతరువాత రాగం తానం పల్లవి- కదనకుతూహలం రాగంలో – త్రిశ్ర గతి ఆది తాళం2 కళలు- పంతుల రమ గానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది హాలు నిండిన ప్రేక్షకులు వారి కరతాల ధ్వనులతో కళాకారులను అభినందించారు .కార్యక్రమం అనంతరం అందరికీ భోజన రూపేనా ప్రసాద వితరణ జరిగింది. చివరగా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఈ ఆరు రోజుల ఉత్సవాలలో రెండవ రోజు అయిన రేపు సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారథ్యంలో జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక నాటకం 60 మంది కళాకారులతో విజయవాడ నుంచి వచ్చి ప్రదర్శించబోతున్నారని అందరూ అధికంగా వచ్చి చూసి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు.శ్రీ పంతులు నరసింగరావు కార్యక్రమాన్ని నిర్వహించారు . డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ కార్యక్రమ సమీక్ష చేశారు.