Home UncategorizedVizag Vision Mumbai:

Vizag Vision Mumbai:

by Deva Trinadh Rao

ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు

అవార్డుల కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• దేశంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత నేను ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను
• నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారత దేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాను.
• సంస్కరణలకు అనుగుణంగానే విజన్ 2020ను అమలు చేశాం. ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్న అభివృద్ధి ఫలాలు అవే.
• ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు 2047 వికసిత్ భారత్ రూపకల్పన చేశారు. అందులో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే నా ఆకాంక్ష
• 1990లో వచ్చిన ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నాం. ఇప్పుడు క్వాంటం, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేశాయి
• ఇప్పుడు ఆ టెక్నాలజీలను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాల్సి ఉంది
• గతంలో విద్యుత్ సంస్కరణల్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి మిగులు విద్యుత్ సాధించాం
• రాష్ట్రంలో వినియోగదారులకు మేలు కలిగేలా నియంత్రణా కమిషన్ ను కూడా తీసుకువచ్చాం.
• సౌర, పునరుద్పాదక విద్యుత్ కు కూడా పెద్ద ఎత్తున భారత్ లో ప్రోత్సాహం కల్పించాం
• ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ అమ్మోనియా లాంటి రంగాల్లో విద్యుత్ ఉత్పత్తి కావాలి
• అప్పుడే ఇంధన రంగంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. డీజిల్, పెట్రోలు, గ్యాస్ లాంటి ఇంధనాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి అనేది కీలకం
• తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తేనే మనకు ప్రయోజనాలు ఉంటాయి
• 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన చేయాలని ప్రధాని లక్ష్యం విధిస్తే అందులో ఏపీ 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నాం
• ఇప్పటికే 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా ముందడుగు వేశాం.
• ప్రోజ్యూమర్ అనే విధానంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పాదన చేసి త్వరలోనే ఎగుమతులు సాధించగలుగుతాం
• గతంలో సౌర విద్యుత్ ప్యానళ్ల కోసం చైనాపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు వాటిని దేశీయంగానే ఉత్పత్తి చేయగలుగుతున్నాం
• గ్రీన్ అమ్మోనియా లాంటి వాటి ద్వారా ఈ ఇంధన లక్ష్యాలను చేరుకోగలుగుతాం
• డేటా సెంటర్లకు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. గూగుల్ సంస్థ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది
• 28న మేం విశాఖలో గూగుల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నాం
• ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం చేయటం ద్వారా దేశానికి టెక్ క్యాపిటల్ ను ఏర్పాటు చేయగలిగాం
• ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం దక్కింది
• ఫ్యూచర్ సిటీగా గ్రీన్, బ్లూ సిటీ, నెట్ జీరో కాన్సెప్టుతో హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం
• సంస్కరణలు సంపదను సృష్టిస్తాయి. రెవెన్యూ వస్తేనే సంక్షేమం చేయగలం.
• అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కీలకమైన అంశం
• మన సమాజం కేవలం మిలియనీర్లు, బిలియనీర్ల కోసం మాత్రమే కాదు. సాధారణ ప్రజలది కూడా
• అందుకే పీ4 పేరిట వారిని ఆదుకునేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమానికి కూడా రూపకల్పన చేశాం
• సమాజంలో ప్రతీ ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందాలి. ఆ కోణంలోనే మా చర్యలు ఉంటాయి
• ఎంబీకే 10-20 అనే ఫార్ములాతో సమాజంలో అట్టడుగున ఉండిపోయిన వారిని సంపద ఆర్జించిన వారు ఆదుకోవటమే ఈ కార్యక్రమం
• భారత్ కు అత్యుత్తమ పెర్ఫార్మర్- రిఫార్మర్ గా ప్రధాని మోదీ ఉన్నారు.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.