పోర్ట్ స్టేడియంలో వాకర్స్ పాస్ లు మరియు సమ్మర్ కోచింగ్


విశాఖపట్నం పోర్టు అధారిటీ పరిధిలోని అక్కయ్య పాలెం పోర్టు స్టేడియంలో వాకర్స్ కోసం నూతన పాస్ ల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి పాస్ ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పోర్టు యాజమాన్యం తెలిపింది. 18-05-2026 నుంచి పోర్ట్ స్టేడియంలోనే నూతన పాస్ ల జారీ ప్రక్రియ ప్రారంభించి 31-05-2026 వరకూ ప్రక్రియను కొనసాగించనున్నట్లు వెల్లడించారు. వాకర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోర్ట్ యాజమాన్యం సూచించింది. నూతన పాస్ లు తీసుకోవాలి అనుకున్న వారు స్టేడియం వద్ద పోర్టు సిబ్బంది ఇచ్చే దరఖాస్తు ఫారమ్ ను నింపి ఒక పాస్ పోర్టు ఫొటో మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ ను జత చేయాలని కోరారు.
గతంలో ఏ విధంగా ఐతే పాస్ ల నిబంధనలు ఉన్నాయో ప్రస్తుతం కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని పోర్టు యాజమాన్యం వెల్లడించింది. వాకర్స్ అందరూ మే 31వ తేదీ నాటికి పాస్ లను తీసుకోవలసిందిగా పోర్టు యాజమాన్యం విజ్నప్తి చేసింది.
సమ్మర్ కోచింగ్ ప్రారంభం
సోమ వారం నుంచి విశాఖపట్నం పోర్టు పరిధిలో చిన్నారులకు వివిధ క్రీడలకు సంబంధించి వేసవి శిక్షణా తరగతలు ప్రారంభించనున్నట్లు పోర్టు యాజమాన్యం ప్రకటించింది. సోమవారం నుంచి పోర్ట్ స్టేడియంలో సంబంధిత క్రీడాలలో ఆశక్తి కలిగిన చిన్నారులు కోచింగ్ కోసం సంప్రదించవచ్చని తెలిపింది. అధ్లెటిక్స్, బాస్కెట్ బాల్, చెస్, క్రికెట్, ఫుట్ బాల్, హాకీ, కబడ్డి, షటిల్ బ్యాడ్మింటన్, టెబుల్ టెన్నిస్, వాలీబాల్ ఆటలలో వెసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నామని ఆశక్తి కలిగిన చిన్నారులు పోర్ట్ స్టేడియంలో నేరుగా వచ్చి ఆయా క్రీడలలో ఆశక్తి ఉన్న వారు పాల్గొనవచ్చని తెలిపారు. వేసవి శిక్షణ పూర్తిగా ఉచితమని చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశాఖపట్నం పోర్టు యాజమాన్యం కోరింది. ప్రతి రోజు సాయంత్రం ఈ శిక్షణా తరగతులు నిపుణులైన పర్యవేక్షకుల సమక్షంలో నిర్వహిస్తారని తెలిపారు.